శివాభిషేకం
ఫలాలు
శివునికి అభిషేకము అన్న మహా ప్రీతి .శివాలయములో శివునికి రకరకాల
ద్రవ్యములతో అభిషేకము చేస్తుంటారు. వాటి వల్ల చేకూరే ఫలాలు.
జలముతో – నష్టపోయినవి తిరిగి లభించును.
కొబ్బరి నీళ్ళతో – సకల సంపదలు సిద్దించును.
పుష్పాలతో ఉన్న నీటితో – భూ లాభము.
ఆవుపాలు – సర్వ సౌఖ్యములు కలుగును.
ఆవు నెయ్యి- ఐశ్వర్య ప్రాప్తి.
గరిక నీటితో – నష్టపోయిన ద్రవ్యము తిరిగి లభించును.
చెరకు రసంతో – ధన వృద్ది కలుగును.
ఆవు పెరుగుతో – ఆరోగ్యము , యశస్సు లభించును.
మారేడు బిల్వ దళ జలముతో- భోగభాగ్యములు సిద్దించును.
తేనెతో – తేజో వృద్ది.
భస్మముతో అభిషేకము-మహా పాపాలు నశించును.
గంధము కలిపిన జలముతో- పుత్ర ప్రాప్తి.
బంగారము ఉంచిన జలముతో- దారిద్ర నిర్మూలన.
రుద్రాక్షలు ఉంచిన జలముతో- సకల ఐశ్వర్యము సిద్దించును.
ద్రాక్ష రసముతో- అన్నింటా విజయము.
ఖర్జూర రసముతో – శత్రు హాని హరించును.
నేరేడు పండ్లు రసముతో- వైరాగ్యము సిద్దించును.
మామిడి పండ్ల రసముతో- దీర్ఘ వ్యాదుల నశించుట.
నవరత్నములు ఉంచిన జలముతో- గృహ, గో, ధాన్య వృద్ది.
పసుపు కలిపిన జలముతో- శుభ కార్యములు, మంగళ ప్రదము.
0 Comments